నిజందాగదుక్షణంఆగదు

Oct 31 2023, 08:45

బీఎస్పీ పార్టీ నల్లగొండ నియోజకవర్గం ఇన్చార్జిగా లోకనబోయిన రమణ ముదిరాజ్

బీఎస్పీ పార్టీ నల్లగొండ నియోజకవర్గం ఇన్చార్జిగా లోకనబోయిన రమణ ముదిరాజ్

బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా ముదిరాజు మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యువనేత బీసీ బిడ్డ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన లోకనబోయిన రమణ ముదిరాజ్ గారిని* నియమించడం జరిగింది ఈ సందర్భంగా నూతనంగా ఎంపికయిన బిఎస్పీ పార్టీ నల్లగొండ అసెంబ్లీ నియోకవర్గ ఇంచార్జ్ లోకనబోయిన రమణ ముదిరాజ్ మాట్లాడుతూ తనను ఎంపిక చేసిన బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి మరియూ సహకరించినటువంటి జిల్లా కమిటీ సభ్యులు అసెంబ్లీ కమిటీ సభ్యులు వివిధ మండలాల అధ్యక్షులకు మరియు బీసీ ముదిరాజ్ సంఘం నుండి వచ్చినటువంటి నాయకులకు అందరికి కూడా ఉద్యమాభి వందనాలు తెలియచేస్తూ నల్లగొండ నియోజకవర్గంలో మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ మన్యవార్ కాన్సిరాం గారి సిద్ధాంతాలను పునికి పుచ్చుకున్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ తరపున సబ్బండ వర్గాలను అందరినీ కలుపుకొని నల్లగొండ నియోజకవర్గంలో బిఎస్పి నీలి జెండాను ఎగరవేసి అసెంబ్లీకి వెళ్ళటానికి బీసీ నాయకునిగా పోరాడతానని తెలియజేస్తున్నానన్నారు, నల్లగొండలో నియోజకవర్గ ప్రజలకు బీసీ బిడ్డలుగా మేము బహుజన్ సమాజ్ పార్టీలోకి వస్తున్నాము అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలు వివిధ పార్టీలో ఉండి అగ్ర కులస్థుల పార్టీల జెండాలు మోస్తున్న బడుగు బలహీవర్గాలు బహుజనులు అందరు కూడా బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్పీ లోకి రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు, బీసీలకు న్యాయం చేసే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమేనని బీసీ లకు 60 ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చి ప్రొత్స హిస్తుంది రేపు జరగబోయే ఎలక్షన్లో నీలి జెండా ఏనుగు గుర్తుకు బిఎస్పీ కి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ లు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటరు దేవుళ్ళకు విజ్ఞప్తి చేసారు

ఇట్టి కార్యక్రమంలో నల్లగొండ జిల్లా ఇన్చార్జీలు పంబాల అనిల్ కుమార్, ఆదిమల్ల గోవర్ధన్ జిల్లా ఉపాధ్యక్షులు కోడి భీం ప్రసాద్ ప్రధాన కార్యదర్శి కత్తుల కాన్సిరాం ఆర్గనైజింగ్ సెక్రటరీ ఒంటెపాక యాదగిరి మైనార్టీ నాయకులు షేక్ చాంద్ పాష గారు జిల్లా ఈసీ మెంబర్ గార మారయ్య నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి చింత శివరామకృష్ణ అంకేపాక శ్రీనివాస్ మరియు నూతనంగా అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు పెరిక అభిలాష్ ప్రధాన కార్యదర్శి సూరారం రాంప్రసాద్ గారు మండల అధ్యక్షులు బొజ్జ నరసింహ కొండా నరేందర్ లింగస్వామి భాను ప్రసాద్ అభినవ్ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Oct 31 2023, 08:26

ఆర్టీసీ బస్సులో నగదు తరలింపు..

ఆర్టీసీ బస్సులో నగదు తరలింపు

ఎన్నికల నియమావళి లో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు ఆదివారం ఓ వ్యక్తి వద్ద భారీగా నగదు లభ్యమైంది. వివరాలు ఇలా ఉన్నాయి.

 ఎన్నికల నియమావళి లో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు ఆదివారం ఓ వ్యక్తి వద్ద భారీగా నగదు లభ్యమైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. బాసర మండల కేంద్రంలోని గోదావరి ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలలో భాగంగా ఆర్టీసీ బస్సును తనిఖీ చేస్తున్న పోలీసులకు బస్సులో ప్రయాణిస్తున్న మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా నాయకం గ్రామానికి చెందిన బాలాజీ మేడేవర్ వద్ద 13 లక్షల రూపాయలు నగదు లభ్యమైంది. నగదుకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో ఎన్నికల నియమావళి ప్రకారం నగదును సీజ్ చేసి పంచనామ జరిపారు. బాసర పోలీసులు వాహనాల తనిఖీలలో సీఐ వినోద్ రెడ్డి, బాసర ఎస్సై గణేష్ తో పాటు బిఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Oct 31 2023, 08:16

ముగిసిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సర్జరీ వివరాలు...

ముగిసిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సర్జరీ

చిన్న ప్రేగుకు 4 చోట్ల గాయాలు. 15 సెంటిమిటర్లపై కడుపును కట్ 10 సెంటిమిటర్లు చిన్న ప్రేగును తొలగించిన యశోద వైద్యులు. 

గ్రీన్ ఛానెల్‌తో హైదరాబాద్‌కు తరిలించకపోతే మరింత ఇబ్బంది అయ్యేది.

రక్తం అంత కూడా కడుపులో పేరుకుపోయింది. అందుకే 15 సెంటిమిటర్లు కట్ చేసి పేరుకుపోయిన రక్తం అంత క్లీన్ చేశాము. లోపల రక్తం పెరుకుపోవడం, ప్రేగుకు 4 చోట్ల గాయాలు కావడంతో సర్జరీ ఇంత ఆలస్యం అయింది - యశోద ఆసుపత్రి వైద్యులు

నిజందాగదుక్షణంఆగదు

Oct 31 2023, 08:02

కెసిఆర్ సినిమా కోసం మా అమ్మకు ఇష్టంగా కొనిచ్చిన ఇంటిని తాకట్టు పెట్టా..

 జబర్ధస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడీయన్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక షో లు చేస్తూ.. వెండితెరపై కూడా తన టాలెంట్‌ను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారిలో రాకింగ్ రాకేష్ ఒకడు. చిన్న కంటెస్టెంట్‌గా జబర్ధస్త్‌లోకి అడుగు పెట్టి.. తన టాలెంట్‌తో కామెడీ టైమింగ్‌తో ఎంతో మంది అభిమానులను దక్కించుకున్నాడు. అంతే కాకుండా ప్రస్తుతం బిగ్ స్క్రీన్‌పై తన అదష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ మేరకు ఓ సినిమాను రూపొందిస్తూ అందులో హీరోగా నటిస్తున్నాడు.

తెలంగాణ ప్రాంతంలోని బంజారాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘కేసీఆర్’ (కేశవ్ చంద్ర రమావత్) సినిమాకు రాకేష్ హీరోగా నటించడంతో పాటు తానే నిర్మిస్తున్నాడు. మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా రీసెంట్‌గా ‘కేసీఆర్’ సినిమా లాంఛ్ గ్రాండ్‌గా జరిగింది. ఈ సినిమా గురించి రీసెంట్‌గా రాకేష్ మాట్లాడుతూ.. ‘హీరోలు, హీరోయిన్లకి ఫ్యాన్స్ ఉన్నప్పుడు కేసీఆర్‌కి ఎందుకు ఉండకూడదు? నేను కేసీఆర్‌కి పెద్ద అభిమానిని. అందుకే ఆయన పేరుతో సినిమా తీస్తున్నా. నేను బినామీ డబ్బులతో ఈ సినిమా నిర్మిస్తున్నాననే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఈ ‘కేసీఆర్‌’ సినిమా కోసం మా అమ్మకు ఎంతో ఇష్టమైన నేను కట్టించిన ఇల్లును తాకట్టు పెట్టా. నా కారు కూడా అమ్మేశా. ఇంటికి సంబంధించిన ఇంటి పేపర్లు కూడా నా దగ్గర ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే.. తాను ఎందుకు ఈ సినిమాకు నిర్మాతగా ఉండాల్సి వచ్చిందంటే ‘గతంలో ఈ సినిమాను తీసేందుకు కొందరు వ్యక్తులు మాటిచ్చి తర్వాత హ్యాండ్ ఇచ్చారు. ఈ కారణంగానే తాను నిర్మాతగా మారాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో మా అమ్మతో పాటు నా భార్య నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు అంటూ వాళ్ల గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు రాకేష్. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిజందాగదుక్షణంఆగదు

Oct 31 2023, 07:44

ఇండియాతో ఫైనల్‌కు వచ్చే జట్టు అదే.. కానీ ...

ఇండియాతో ఫైనల్‌కు వచ్చే జట్టు అదే.. కానీ అక్కడ మాత్రం'

వన్డే ప్రపంచకప్‌-2023 రసవత్తరంగా సాగుతోంది. ఈ టోర్నీలో అతిథ్య భారత్‌ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు 6 విజయాలు సాధించిన టీమిండియా సెమీస్‌ బెర్త్‌ను దాదాపు ఖారారు చేసుకుంది. మరోవైపు డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌ పరిస్థితి మాత్రం మరీ ఘోరంగా ఉంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఐదింట ఓటమిపాలైన ఇంగ్లండ్‌.. సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించింది. 

కాగా పాయింట్ల పట్టికలో టాప్‌-4లో వరుసగా భారత్‌, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. టాప్‌-4లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫైనల్‌ పోరుకు అర్హత సాధించే రెండు జట్లను ఆస్ట్రేలియా స్పిన్నర్‌ అస్టన్‌ అగర్‌ ఎంచుకున్నాడు. ఈ మెగా టోర్నీ ఫైనల్లో టీమిండియా, ఆస్ట్రేలియా తలపడతాయని అగర్‌ జోస్యం చెప్పాడు.

వరల్డ్‌కప్‌ ఫైనల్‌ కచ్చితంగా భారత్‌- ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. అయితే టీమిండియా టైటిల్‌ ఫేవరేట్‌ అంతా భావిస్తున్నారు. కానీ స్వదేశంలో వరల్డ్‌కప్‌ జరుగుతుండడంతో భారత జట్టుపై కచ్చితంగా ఒత్తడి ఉంటుంది.

ఒత్తడి ఎంత పెద్ద జట్టు అయినా తప్పులు చేస్తుంది. ఫైనల్లో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ చేసి భారీ స్కోర్‌ సాధిస్తే.. ప్రత్యర్ధిపై పై చేయి సాధించే ఛాన్స్‌ ఉందని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అగర్‌ పేర్కొన్నాడు. కాగా అగర్‌ గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు.

నిజందాగదుక్షణంఆగదు

Oct 30 2023, 18:58

బీ.ఆర్.ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా.* బీ.ఆర్.ఎస్ పార్టీ వికలాంగుల రాష్ట్ర నాయకులు,తెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర కన్వీనర్

బీ.ఆర్.ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా.

బీ.ఆర్.ఎస్ పార్టీ వికలాంగుల రాష్ట్ర నాయకులు,తెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర కన్వీనర్,వి-జేఏసీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్, ఎరుకల సంఘం రాష్ట్ర కార్యదర్శి పల్లకొండ కుమారస్వామి.

భవిష్యత్తు కార్యాచరణ ఏర్పాటు చేసి,ప్రజల సంక్షేమం కొరకు ఉద్యమం చేస్తా 

నాపై,మా కుటుంబంపై భూ కబ్జా దారుల దాడి చేస్తే ఇంత వరకు బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా పరమార్చించే పాపన లేదు,ఈ దాడిఫై ఎందుకు స్పందించలేరూ!ఆదుకొనే నాయకులు లేరా?

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రానికి చెందిన పల్లకొండ కుమారస్వామి అలియాస్ (టి.ఆర్.ఎస్. కుమారస్వామి) బీ. ఆర్. ఎస్ పార్టీ వికలాంగుల రాష్ట్ర నాయకులు,టి.వి.ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మరియు ఎరుకల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉండి బీ.ఆర్.ఎస్ పార్టీకి అనుబంధంగా పని చేస్తూ ఇన్ని సం,,రాలుగా బీ.ఆర్.ఎస్ పార్టీలో కొనసాగుతూ వస్తున్నాను.

   నాడు ఉద్యమంలో తెరాస పార్టీ నుంచి నేను గత 2009-2023 వరకు 14 సం,,రాలుగా ఇప్పటి వరకు బీ. ఆర్.ఎస్ పార్టీ తరుపున పని చేస్తున్నాను.కొన్ని రోజుల క్రితం 03.10.2023 మంగళవారం రోజున భూ కబ్జా దారులు జున్నుతుల మహేందర్ రెడ్డి, జున్నుతుల శ్రీధర్ రెడ్డి మరి కొంతమందితో మా ఇంటిని జేసీబీతో కుల్చేసే క్రమంలో మా కుటుంబ సభ్యులు అడ్డుకోగా వారిని కొడుతుండగా నేను ఇంట్లో ఉండి వీడియో తీస్తుండగా నాపై జున్నుతుల మహేందర్ రెడ్డి,జున్నుతుల శ్రీధర్ రెడ్డి,మరి కొంతమందితో వికలాంగుడని తెలిసి కూడ ఇంట్లోకి చొరబడి నన్ను హత్య చేయడానికి వచ్చి విపరీతంగా కొట్టడం వల్ల నా దౌడా ఎముక విరిగి,రెండు పండ్లు రాలిపోవడం వల్ల ఇప్పటికి వరకు కోలుకోలేని స్థితిలో ఉన్నాను.నా నోటి ద్వారా అన్నం తినక,ద్రవ పదార్థాలు మాత్రమే అతి కష్టంగా తీసుకుంటున్నాను.నా ఆరోగ్య పరంగా చాలా నష్ట పోయాను.నోటితో మాట్లాడలేక మాట్లాడుతుంటే విరిగిన దౌడా ఎముక నుంచి రక్తస్రవం అవుతుంది.

    హన్మకొండ,వరంగల్ హాస్పిటల్ లో అడ్మిట్ కాగా అన్ని టెస్ట్ లు చేసిన విరిగిన దౌడాకి సర్జరీ చేస్తే తట్టుకోలేవని డాక్టర్స్ సర్జరీ చేయలేమని తెలిపారు.హైదరాబాద్ నిమ్స్ కి వెళ్లి సర్జరీ చేయించుకోవాలని సూచించారు.కనీసం రెండు లక్షలు సర్జరీకి కావాలని చెప్పారు.డబ్బులు లేక సర్జరీకి వెళ్ళలెకపొయాను.ఇంత పెద్ద దాడి సంఘటన జరిగిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి,వికలాంగుల రాష్ట్ర చైర్మన్ వాసుదేవ రెడ్డి,పెద్ది స్వప్న మేడం మరియు చెన్నారావుపేట మండల నాయకులు వచ్చి ఇంత వరకు నన్ను పరామర్చించే పాపన రాలేదు.నన్ను ఆదుకొనే నాథుడే లేడు,నా ఇంటి స్థలంకు రక్షణకు అడ్డు పడితే నన్నే కొట్టారూ.నేను ఏ పాపం చేశాను.ఉద్యమం నుంచి గత 14సం,రాలు తెరాస పార్టీకి మీకు శిశునిగా ఉండి నేను ఎప్పుడు ఎలాంటి పదవులు కావాలని అడిగాలేదే.ఇప్పటి వరకు పార్టీ పరంగా పదవులు ఇవ్వాలని అడగలేదు.

    14సం,రాల క్రితం అప్పుడు ఉద్యమంలో జెండా పట్టుకొని ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న నాయకులు అప్పుడు ఉన్నారని ఎమ్మెల్యేని కోరుతున్నా,మేం పార్టీకి అండగా ఉంటూ సోచల్ మీడియాలో సంక్షేమ పతకాలు గురించి ప్రతి ఎన్నికల్లో ప్రచారం చేస్తూ అసెంబ్లీ ఎన్నికలో మీ వెంట ఉండి మిమ్మల్ని గెలిపించుకున్నాం.ఇప్పుడు మేం మీకు ఏ అన్యాయం చేశాం.నాపై దాడి జరిగితే,దాడి చేసిన వారిపై ఎందుకు నోరు విప్పలేక పోయారని అడుగుతున్న.కనీసం ఫోన్ లో కూడ పలకరింపు లేని నాయకులు ఉన్నారా? ఈ బీ. ఆర్.ఎస్. పార్టీలో మా లాంటి వికలాంగులపై దాడి జరిగితే ఎందుకు మీరు స్పందించలేరు.ఈ తక్కువ జాతికి చెందిన వికలాంగులు మీ పార్టీలో ఉండటం దూర దృష్టకరమా? లేదా తక్కువ జాతి కులమా భవిస్తున్నారా?మీ పార్టీ జెండా పట్టుకొని మీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డం,నన్ను ఆదుకోలేకపోయారే?నాపై,మా కుటుంబంపై జరిగిన దాడికి మనస్తపం చెంది 

ఈ బీ.ఆర్.ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను,త్వరలో ప్రజల కొరకు,ప్రజల సంక్షేమం కోసం భవిష్యత్తు కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటాను.

నిజందాగదుక్షణంఆగదు

Oct 30 2023, 18:45

రైలు ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి:వి. కృష్ణ మోహన్ నేషనల్ చైర్మన్కాన్ఫెడరేషన

రైలు ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదంలో పలువురు సిబ్బంది, ప్రయాణికులు మరణించడం, గాయాలపాలవడం బాధాకరం.

ఆగని రైల్వే ప్రమాదాలు - ప్రయాణికుల భద్రతకై నేర్వాల్సిన పాఠాలు.

రైల్వేలో 3,15,780 సాంక్షనై ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయండి.

బడ్జెట్ లో కోతలు, చార్జీల పెంపు, స్లీపర్ కోచ్ ల తగ్గింపు, రైళ్ళలో రద్దీ, జాప్యం, రాయితీల ఎత్తివేత, శానిటేషన్, పార్కింగ్ దోపిడీ తదితర సమస్యలను పరిష్కరించండి.

కాగ్, పార్లమెంటరీ ప్యానెల్, నిపుణుల సిఫార్సులను అమలు పరచాలి. భద్రతకు విఘాతం కలిగించే విధానాలను విడనాడాలి.

రైలు ప్రమాదాలపై సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తో స్వతంత్ర విచారణ జరిపించాలి.

 జూన్ నెలలో అత్యంత ఘోరమైన కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో 291 మంది మరణించి 1100 మందికి పైగా గాయపడిన ఘటన మరువక ముందే దేశవ్యాప్తంగా జరుగుతున్న పలు దుర్ఘటనలను ఉద్యోగుల, ఆఫీసర్ల,పెన్షనర్ల జాతీయ నేత వి. కృష్ణ మోహన్ ప్రధాన మంత్రికి తాజాగా వ్రాసిన లేఖలో పేర్కొంటూ భద్రతా లోపాలను ఎత్తి చూపారు. 

కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీ.సీ.జీ.జీ.ఓ.ఓ), దాని అనుబంధ గుర్తింపు పొందిన ఇండియన్ రైల్వే ప్రమోటీ ఆఫీసర్స్ ఫెడరేషన్ (ఐ.ఆర్.పి.ఓ.ఎఫ్) తదితరులు పలుమార్లు వివిధ అంశాలపై సమర్పించిన వినతి పత్రాలను, కాగ్ నివేదికలను జత చేశారు. రైల్వే భద్రతకు సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించాలని, వ్యవస్థాగత లోపాలను సరిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (ఐ.ఆర్.ఎమ్.ఎస్) పేరిట ఇటీవల ప్రవేశపెట్టిన స్కీం పట్ల పునరాలోచన చేయాలని కోరారు.

హౌరా- విశాఖపట్నం - విజయవాడ - చెన్నై మార్గంలో 2011-12లో అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ 'కవచ్' నెలకొల్పక పోవడం, సిగ్నలింగ్ టెలీ కమ్యూనికేషన్ కింద కేటాయించిన బడ్జెట్లో అత్యధికంగా ట్రాఫిక్ ఉన్న రైల్వే మార్గంలో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్, సెంట్రలైజ్డ్ ట్రాఫిక్ కంట్రోల్ తదితరములకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయక పోవడం, రైల్వే లైన్లు, సిగ్నల్ వ్యవస్థ, ట్రాకుల ఆధునీకరణ చేపట్టకపోవడం శోచనీయమన్నారు.

రైల్వేలలో కనీస అవసరాలకు ప్రాధాన్యత నివ్వకుండా, సాధారణ ప్రయాణికుడిని విస్మరిస్తూ ఆదాయాన్ని గడిస్తున్న రైల్వే శాఖలో 3.11 లక్షల గ్రూప్ సి పోస్టులు, 3,018 గెజిటెడ్ క్యాడర్ సాంక్షన్ అయిన పోస్టులు ఖాళీగా వున్నా భర్తీకి నోచుకోకపోవడంతో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటంతో మిగిలిన ఉద్యోగులపై తీవ్రమైన పనిభారం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేసారు. దీంతో చాలా మంది మహిళా లోకో పైలట్లు, ఇతర సిబ్బంది రోజుకు 12 గంటలకు మించి సెలవు లేదా విశ్రాంతి లేకుండా నిద్రలేమి, బిజీ షెడ్యూల్స్ తో పని చేస్తున్నారని తెలిపారు. 

ప్రభుత్వ వాదనలు దాని స్వంత ఆడిటర్‌ అయిన కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) గతేడాది నివేదికలో చెప్పిన దానికి విరుద్ధంగా ఉన్నాయి. రైలు భద్రతపై కాగ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ట్రాక్‌ల పునరుద్ధరణకు నిధుల కేటాయింపు తగ్గిందనీ, కేటాయించిన నిధులను కూడా పూర్తిగా వినియోగించడం లేదని పేర్కొన్నది. 2017-2021 మధ్య జరిగిన రైల్వే ప్రమాదాలపై కాగ్‌ విశ్లేషణ ప్రకారం.. ఈ కాలంలో మొత్తం 2017 ప్రమాదాలు జరిగాయి. అందులో పట్టాలు తప్పినవి 1392 ప్రమాదాలు (69 శాతం). అంటే పట్టాలు తప్పి ఢీ కొనటం వంటి రైల్వే ప్రమాదాలే అధికంగా ఉండటం గమనార్హం. అయితే ఈ ప్రమాదాలకు కారణం ‘మానవ తప్పిదం’ అని నిందించటం ఏండ్లుగా ఒక సాధారణ ధోరణిగా మారిందనీ, అయితే కాగ్‌ నివేదిక ప్రభుత్వ వాదనలు తప్పని నిరూపిస్తున్నదని తెలిపారు.

ట్రాక్ ల నిర్వహణ, బడ్జెట్ కేటాయింపులు, వ్యయం, పోస్టుల ఖాళీలపై కేంద్రానిది తీవ్ర నిర్లక్ష్యమని కాగ్ 2022 సెప్టెంబర్ నివేదికలో అక్షింతలు వేసినా, రైలు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినా, లోపాలు ప్రస్తావించినా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.

2017-18లో ప్రవేశపెట్టిన రాష్ట్రీయ రైల్‌ సంరక్ష కోష్‌ (ఆర్‌ఆర్‌ఎస్‌కే) రైల్వే భద్రతా నిధి గురించి కాగ్‌ ఉటంకించింది. 1127 పట్టాలు తప్పగా 289 (26 శాతం) మాత్రమే పునరుద్ధరణ పనులకు నోచుకున్నాయని వివరించింది. ఆర్‌ఆర్‌ఎస్‌కే నుంచి ప్రాధాన్యత-1 పనులపై మొత్తం వ్యయం 2017-18లో 81.55 శాతం నుంచి 2019-20లో 73.76 శాతానికి తగ్గుదల ధోరణిని చూపించిందని పేర్కొన్నది. ట్రాక్‌ పునరుద్ధరణ పనులకు 2018-19లో నిధుల కేటాయింపు రూ.9607.65 కోట్ల నుంచి 2019-20లో రూ.7417 కోట్లకు తగ్గింది అని కాగ్‌ వివరించింది. అత్యంత రద్దీగా ఉండే పశ్చిమ రైల్వే కోసం 2019-20లో మొత్తం వ్యయంలో ట్రాక్‌ పునరుద్ధరణ కోసం ఖర్చు చేసినది 3.01 శాతమే కావటం గమనార్హం. భద్రతకు సంబంధించిన పనులకు ఆర్థిక సాయం అందించటానికి ప్రత్యేక నిధిని సృష్టించే ఏకైక ఉద్దేశ్యం విజయం సాధించ లేకపోయిందని కాగ్‌ పేర్కొన్నది. పట్టాలు తప్పడానికి ప్రధాన కారణం ట్రాక్‌ నిర్వహణ అని వివరించింది. భారత రైల్వే లక్షలాది ఖాళీలతో, నామ మాత్రపు అవుట్‌సోర్సింగ్‌తో కార్యకలాపాలను నిర్వహించిందని కాగ్‌ వెల్లడించింది.

ట్రాక్ ల సమర్థవంతమైన నిర్వహణ, సిగ్నలింగ్ వ్యవస్థ, రోలింగ్ స్టాక్ మొదలైన వాటితో పాటు తగిన సంఖ్యలో నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించడం మరియు అన్నింటికంటే ముఖ్యంగా రైల్వే ఆపరేషన్ యొక్క వివిధ విధుల మధ్య సమర్థవంతమైన సమన్వయంపై ఆధారపడి ఉంటాయి. వీటన్నింటినీ నిర్లక్ష్యం చేయబడ్డాయని తెలిపారు. 2017 లో సమర్పించిన భద్రతపై టాస్క్ ఫోర్స్ సిఫార్సులను, 2015 లో రైల్వే మంత్రిత్వ శాఖ 'శ్వేతపత్రం'ను అమలు చేయలేదు. పాత ట్రాక్ ను యుధ్ధ ప్రాతిపదికన మార్చాల్సి ఉంటుందని, కానీ ఆర్థిక వనరులు లేమి సాకుతో చేయకపోవడంతో బ్యాక్ లాగ్ పెరుగుతూనే ఉన్నదని, అదే సాకుతో పాతబడి పోయిన సిగ్నల్ గేర్ ను కూడా మార్చటం లేదని అన్నారు.

రైల్వేలు ప్రజల ఆస్తియని,మన ప్రజల సొమ్ముతో భారత కార్మికుల కష్టాలతో భారతీయ రైల్వేలు నిర్మించబడ్డాయని పేర్కొన్నారు. రైళ్ళు, రోడ్లు సామాన్య ప్రజలకు సరసమైన రవాణాను అందించడానికి ఉద్దేశించబడినవని, ఇవి ఏ ప్రభుత్వమైనా తన పౌరులకు సరసమైన ధరలకు భద్రతతో అందించాల్సిన సేవలని గుర్తు చేశారు. ప్రైవేటు కార్పొరేట్లకు లాభాలను ఆర్జించే మార్గాన్ని సృష్టించేందుకు భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించవద్దని కోరారు.

2017-21 మధ్య కాలంలో 2వేలకు పైగా దుర్ఘటనలు జరిగాయి. వీటి వల్ల జరిగిన ప్రమాదాలు 217 ఉన్నాయి. వీటిల్లో ప్రాణ నష్టం, గాయపడడం, రైల్వే ఆస్తులకు నష్టం వంటివి సంభవించాయి. బృహత్తరమైన రైల్వే వ్యవస్థలో అంతా సవ్యంగా సాగడం లేదు. రైళ్ళు ప్రయాణించే ట్రాక్‌లు, సిగ్నలింగ్‌ వ్యవస్థను నియంత్రించే ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థలో పొరపాటు కారణంగా బాలాసోర్ ప్రమాదం జరిగిందని రైల్వేబోర్డు, రైల్వే మంత్రి పేర్కొన్నారు. 2017-21 మధ్య కాలంలో రైల్వేస్‌లో రైళ్ళు పట్టాలు తప్పిన ఘటనలపై కాగ్‌ ఇచ్చిన నివేదిక వ్యవస్థలో ఉన్న కొన్ని ప్రమాదకరమైన లోపాలను ప్రముఖంగా ఎత్తిచూపింది. రైల్వే ట్రాక్‌ల్లో నిర్మాణపరమైన లోపాలను, అలాగే పాయింట్లు, లైన్లు, కర్వ్‌లు వంటి అంశాలను తనిఖీ చేసి అంచనా వేసే ట్రాక్‌ రికార్డింగ్‌ కార్ల సోదాలు 30-100 శాతం తగ్గాయని ఆ నివేదిక పేర్కొంది. పట్టాలు తప్పిన 1129 ఘటనల్లో 422 ఘటనలు ఇంజనీరింగ్‌ సమస్యలు (ట్రాక్‌ల నిర్వహణ సరిగా లేక పోవడం (171 కేసులు), ట్రాక్‌ ప్రామాణికాలు పాటించకపోవడం (156 కేసులు) వల్లే జరిగాయని పేర్కొంది. బోగీల చక్రాల్లో లోపాల వల్ల జరిగిన ప్రమాదాలు 182 ఉండగా, పాయింట్లు సరిగా నిర్దేశించక పోవడం, ఇతర పొరపాట్ల కారణంగా 275 ప్రమాదాలు జరిగాయని నివేదిక పేర్కొంది.

జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) రికార్డుల ప్రకారం గడిచిన పదేళ్లలో జరిగిన రైలు ప్రమాదాల్లో 2.6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 70 శాతం మంది 2017- 21 మధ్య కాలంలో మరణించారని పేర్కొన్నారు.

ప్రారంభించిన రైలునే అట్టహాసంగా మళ్ళీ ప్రారంభించే బదులు సామాన్యులు ప్రయాణించే రైళ్ల బాగోగులు పట్టించుకోవాలని, కార్పొరేటీకరణ, ప్రయివేటీకరణే అన్నింటికీ పరిష్కారం అనే మానసిక స్థితి నుండి బయటపడి వాస్తవాలను ఆలోచించి ప్రజల భద్రతకు ఏం చేయాలో తెలుసుకుని ఇప్పటికైనా పూనుకోవాలని, దుఃఖితులకు ఓదార్పునివ్వాలని కోరారు. ప్రతి వందేభారత్ కోసం రైల్వే రూ. 115 కోట్లు పైగా వెచ్చిస్తున్నదని, 2027 తర్వాత ప్రారంభమయ్యే బుల్లెట్ ట్రైన్ వంటి అసాధారణ రేట్లుండే రైళ్ళతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఒరిగేదేముంటుందని ప్రశ్నించారు. 

తమ వైఫల్యం, అసమర్థతలను, చేతగానితనాన్ని కప్పి పుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకే ఘోర రైలు ప్రమాదంలో కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చారని, ఎక్కడ పెద్ద ప్రమాదం జరిగినా రైల్వే మంత్రిత్వ శాఖకు ఇది అలవాటేనని ఆయన పేర్కొన్నారు. ఐటీ సెల్‌ లోని పెయిడ్‌ ఆర్టిస్టులు దానికి అన్ని రకాల అబద్ధాలూ గుప్పించి, మతపరమైన మసాలా జోడించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని, దర్యాప్తు నివేదిక బయటకు వచ్చేసరికి ప్రజలు దాన్ని మర్చిపోతారని ఆయన పేర్కొన్నారు. 

2023 మార్చిలో రైల్వే భద్రతపై పార్లమెంటరీ ప్యానెల్ సమర్పించిన నివేదికలో రైల్వే మంత్రిత్వ శాఖ అలసత్వాన్ని ఎత్తి చూపిందని, రైల్వే భద్రతకు సంబంధించిన నివేదికలు విస్మరించబడుతున్నాయని వివరించిందని తెలిపారు. కమిషన్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ (సీఆర్‌ఎస్‌) చేసిన సిఫారసులు రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి అత్యంత ప్రాముఖ్యతను పొందవల్సి ఉన్నప్పటికీ అది వాస్తవానికి భిన్నంగా ఉన్నదనీ, తక్కువ శ్రద్ధను కలిగి ఉన్నదని పేర్కొన్నది. రైలు ప్రమాదాలు పునరావృతం కాకుండా ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా ఏటీఆర్‌లను సమర్పించడానికి కాలపరిమితిని నిర్ణయించాలని ప్యానెల్‌ ఆ నివేదికలో సిఫారసు చేసిందని గుర్తు చేశారు. రైల్వే ప్రయాణికుల భద్రతకు విఘాతం కలిగించే విధానాలను విడనాడాలని,కాగ్, పార్లమెంటరీ ప్యానెల్, నిపుణుల సిఫార్సులను అమలు పరచాలని వి. కృష్ణ మోహన్ ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేశారు.

నిజందాగదుక్షణంఆగదు

Oct 30 2023, 18:36

అభివృద్ధిని చూసి ఆదరించండి: సునీత జగదీశ్వర్ రెడ్డి

నిజందాగదుక్షణంఆగదు

Oct 29 2023, 18:12

రాష్ట్ర సుభిక్షం.. బీఆర్‌ఎస్‌తోనే సాధ్యం: గుంటకండ్ల సునిత జగదీష్ రెడ్డి

రాష్ట్ర సుభిక్షం.. బీఆర్‌ఎస్‌తోనే సాధ్యం: గుంటకండ్ల సునిత జగదీష్ రెడ్డి

 సూర్యాపేట 

 బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సతీమణి సునీత జగదీశ్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. సూర్యాపేట పట్టణంలోని 31వ వార్డులో కౌన్సిలర్, మహిళా ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి జోరుగా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి కారుగుర్తుకు ఓటు వేయాలని కోరారు. టిఆర్ఎస్ మేనిఫెస్టోను వివరిస్తూ ఆప్యాయంగా పలకరించారు.

. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధిని తొమ్మిదిన్నర ఏండ్లలో చేసి చూపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.సంక్షేమ పథకాలు, అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉందన్నారు. ప్రజల శ్రేయస్సుకు, రాష్ర్టాభివృద్ధికి ఎంతో ముందుచూపు ఆలోచనతో సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని వివరించారు. ప్రజా సంక్షేమ పథకాలు, సూర్యాపేట అభివృద్ధి ఎవరూ చేశారో ప్రజలకు తెలుసని అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ మరింత అభివృద్ధిని సాధించాలంటే ఎమ్మెల్యే గా జగదీష్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

 

గడపగడపకూ వెళ్లి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ కారుగుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. వార్డుల్లో కదిలిన గులాబీదండుతో వార్డులు గులాబీమయంగా మారాయి.

నిజందాగదుక్షణంఆగదు

Oct 29 2023, 17:39

నల్లగొండ మున్సిపల్ చైర్మన్ వార్డులో కదిలిన భూపాల్ రెడ్డి ఎన్నికల ప్రచార రథం.. ఒక పండగల కదిలించిన జన సమూహం..

బి ఆర్ ఎస్ పార్టీ నల్గొండ శాసనసభ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి గారు... 17, 16, 15 వార్డులలో.. విస్తృతంగా తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

 మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి సొంతవార్డు కావడంతో...

 పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలు..

 అడుగడుగునా కంచర్లకు జననీరాజనాలు..

 చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు జెండాలు చేత బుని కారు గుర్తు గెలవాలని, మళ్లీ కంచర్ల ఎమ్మెల్యేగా... గెలవాలని నినాదాలు చేస్తూ ముందుకు సాగిన వందలాదిమంది జనం.

 ఆర్జాల బావి, తదితర సమావేశాల్లో మాట్లాడిన కంచర్ల...

 నల్లగొండలో... 1300 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు శనవేగంగా కొనసాగుతున్నాయని మరో రెండు సంవత్సరాల్లో అవి పూర్తవుతాయని అవి పూర్తి కావాలంటే మళ్ళీ నల్లగొండలో గులాబీ జెండా ఎగరాలే కెసిఆర్ ప్రభుత్వమే రావాలనిఅన్నారు.

 ఇందుకు మీ సహకారము ఆశీర్వచనాలు కావాలని.. చైతన్యవంతులైన నల్లగొండ ప్రజలు నల్లగొండ అభివృద్ధిని చూసి తనను తప్పక మళ్ళీ గెలిపిస్తారని విశ్వాసం తమకు ఉందని, ఉన్నారు..

 నల్లగొండ ప్రజలు... కరోనాతో విలవిల లాడుతూ హాస్పిటల్ లో వందలాదిమంది... చికిత్స పొందుతుంటే.. తను వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వారిని.. పరామర్శించి ధైర్యం చెప్పానని... వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించాలని... కరోనాతో మరణించిన వారి.. దహన సంస్కారాలు వాళ్ళ కుటుంబ సభ్యులు చేయలేకపోతే తానే దగ్గర ఉండి ఆ విధులు నిర్వహించానని... మరి నల్లగొండలో నాలుగు సార్లు గెలిచిన కోమటిరెడ్డి ఎక్కడ ఉన్నాడో ప్రజలు ప్రశ్నించాలని కోరారు.. నిరంతరం ప్రజల మధ్య 365 రోజులు ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ.. మీ మధ్యన ఉన్నానన్నారు.

 గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన కోమటిరెడ్డి.. బత్తాయి మార్కెట్ తెస్తానన్నాడు మెడికల్ కాలేజ్ తెస్తానన్నాడు, ఐటీ మంత్రిగా ఐటీ హబ్ ఏర్పాటు చేస్తానన్నాడు... వీటిలో ఏ ఒక్కటి తేలేదని, కెసిఆర్ నాయకత్వంలో అవన్నీ తాము తీసుకొచ్చామని,పానగల్ మర్రిగూడ, బైపాస్ రోడ్ ల లో ఫ్లైఓవర్ నిర్మించకుండా...

 పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు బలిగొన్నాడనన్నారు.

 ఇప్పుడు ఆ రెండు ఫ్లై ఓవర్ ల లో పానగల్ ఫ్లైఓవర్ పూర్తయిందని మర్రిగూడ ఫ్లైఓవర్ శర వేగంగా నిర్మాణం అవుతుందన్నారు.

 

తను నిరంతరం ప్రజలకు ప్రజల మధ్యన ఉంటూ... ప్రజల్ని నమ్ముకున్నానని... కానీ కోమటిరెడ్డి నోట్ల కట్టలతో... నాయకులను కొని వారిని నమ్ముకున్నాడని... అలాంటి వారికి సరైన గుణపాఠం చెప్పాలని కంచర్ల కోరారు.

 

కెసిఆర్ మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాక... ఆసరా పెన్షన్లు 3016 నుంచి 5016 వరకు విడతల వారిగా పెంచుతారని, దివ్యాంగుల పెన్షన్ 6016 చేస్తారని, రైతుబంధు 12000 నుంచి 16 వేల వరకు విడుతలవారీగా పెంచుతారని, అర్హులైన మహిళలకు ₹3,000 భృతి అందిస్తారని, గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకే అందిస్తారని, బిపిఎల్ కుటుంబాల అందరికీ ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వర్తింప చేస్తామని తెలిపారు. నల్లగొండ అభివృద్ధి కొనసాగాలంటే రెండవసారిగా మీ సేవకుడిగా రక్షకుడిగా .. కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి,మోదుగు రాజ వర్ధన్ రెడ్డి, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, 16వ వార్డు ఇంచార్జ్ దాసరి రమేష్,15 వ వార్డు ఇంచార్జి దొడ్డి రమేష్, యుగంధర్ రెడ్డి ఇస్రం రవి,ముదిరెడ్డి శ్రీనివాసరెడ్డి,కట్టా హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.